జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు . అయితే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ ను ముగించి వార్ 2 సినిమా షూటింగ్ కి జాయిన్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కూడా తన అనుకున్న వారికి, తనను అభిమానించే వారికి కావాల్సినంత సమయంను ఎన్టీఆర్ ఇస్తూనే ఉంటారు. తాజాగా హీరో విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ ను కలిసిన విషయం తెల్సిందే. ఇద్దరికి కూడా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో వారు చెప్పుకొచ్చారు. అలా తమ అభిమాన నటుడిని నిర్మాత నాగ వంశీ తో కలిసి విశ్వక్ సేన్ మరియు సిద్దు లు కలిసి కొద్ది సమయం సరదాగా గడిపారు.
ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ఫోటోలు కూడా షేర్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్ తనపై ఇంతటి అభిమానం కనబరుస్తున్న సిద్దు జొన్నలగడ్డ కోసం సక్సెస్ మీట్ లో పాల్గొనెందుకు సిద్ధం అయ్యాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 8 రోజుల్లో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వారు అందరూ సోమవారం సినిమాకు భారీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సక్సెస్ మీట్ కు మన ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవ్వబోతున్నాడు అనే విషయము తెలుస్తుంది. సిద్దుకు తనపై ఉన్న అభిమానం కోసం దేవర ఈ మీట్ కు వచ్చేందుకు కూడా ఒప్పుకున్నాడు అని అనుకుంటారు