ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది నెమ్మదిగా పార్టీ నేతలు పక్క చూపులు చూస్తూ ఊహించని విధంగా సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. అధికార పార్టీ వైసీపీకి దెబ్బమీద దెబ్బ అన్నట్టు పలువురు కీలక నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ మారిన నేతలు టీడీపీలో చేరారు. తాజాగా జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈరోజే ఆయన రాజీనామా ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వేణుగోపాల్ రెడ్డి పని చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా తనకు సరైన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తిలో ఆయన ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. మరి ఆయన నుండి ఈ విషయం పై అధికారికంగా ప్రకటన వెలువడే వరకు చూడాలి.